హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లా విజయానికి తోడ్పాటునందించిన మంత్రి ఎర్రబెల్లి తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ జెడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, ఆల వేంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, సాంబారి సమ్మారావు తదితరులు ఉన్నారు.