హైదరాబాద్ : ఫిబ్రవరి నెలలో బెంగుళూరులో జరిగిన జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో సబ్ జూనియర్ 12 సంవత్సరాల బాలికల విభాగంలో శ్రీనిక బంగారు పతకం సాధించింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తొండకురు గ్రామానికి చెందిన క్రీడాకారిణి శ్రీనికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
శ్రీనిక త్వరలో నేపాల్ దేశం రాజధాని ఖాట్మండులో జరిగే అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననుంది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..శ్రీనిక అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. నాణ్యమైన శిక్షణ తీసుకొని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
శ్రీనిక వెంట కోచ్ మాస్టర్ బి. హీరాలాల్ ఉన్నారు.