హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలక భూమిక పోషించారని అన్నారు. జంగ్ ప్రహ్లాద్ మరణం తెలంగాణ కళాకారులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు.