హైదరాబాద్ : అమెరికా చికాగో నగరంలో అక్టోబర్ 10న జరిగే వరల్డ్ ఫుల్ మారథాన్ (42.2 కిలోమీటర్లు)కు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన జగన్మోహన్రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి రాష్ట్ర అబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో అభినందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుల్ మారథాన్లో పాల్గొనే అవకాశం రావడం తెలంగాణకే గర్వకారణమన్నారు. మారథాన్లో 200 దేశాల నుంచి సుమారు 30వేల మంది అథ్లెట్లు పాల్గొంటారన్నారు.
ఈవెంట్లో పాల్గొనేందుకు ముందస్తుగా ఢిల్లీలో నిర్వహించిన ఫుల్ మారథాన్లో క్వాలిఫై కావడంతో అమెరికాలో జరిగే మారథాన్కు ఎంపికయ్యారన్నారు. మారథాన్ను 2.55గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్రెడ్డి ఫుల్ మారథాన్లో మంచి ప్రతిభ కనబరిచి తెలంగాణకు పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రాష్ట్ర క్రీడాశాఖ తరఫున అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, వెటరన్ క్రీడాకారులు, ఎంఎల్ఆర్ విద్యాసంస్థ చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి పాల్గొన్నారు.