త్రిపుర : మినీ ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
దక్షిత త్రిపుర పరిధిలోని న్యూటన్ బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. మృతులను, క్షతగాత్రులను బీజేపీ కార్యకర్తలుగా గుర్తించారు.
వీరంతా ఎన్నికల ప్రచారానికి వెళ్లి వాహనంలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.