పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ బాలాజీ డైరీ సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. శ్రీవారి దర్శనం అనంతరం కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని తిరుపతికి మినీ బస్లో వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. మినీ బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు కాకపోవడంతో బోల్తా పడ్డట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో పద్మ,రాము, గీత, లింభాలేశ్వరి, కౌశిక్ కుమార్, రాజ్ కుమార్, మంజుల, ప్రమీల, నిఖిల, హైందవి, విష్ణు శ్రీ,వెంకటేశ్వర్లు, కల్పన, నికిత, వైష్ణవి, వెంకటేష్, మహేశ్వరి, అరుణ, శర్వాణీలకు గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే రుయా ఆసుపత్రితోపాటు మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా హైదరాబాద్ లోని రామంతపూర్,అంబర్ పేట,రాంనగర్ కు చెందిన నాలుగు కుటుంబాల సభ్యులుగా గుర్తించారు.