కోల్కతా: పశ్చిమబెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా మైండ్గేమ్లు పని చేయబోవని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన జిమ్మిక్కులు గుజరాత్కు పరిమితం చేసుకోవాలని ఆదివారం సూచించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని మీడియా సమావేశంలో అమిత్షా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై డెరెక్ ఓ బ్రెయిన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మైండ్ గేమ్స్ పని చేయవు.. మోదీ-షా.. మీ సీట్ల స్టంట్లు గుజరాత్ జింఖానాలో ట్రై చేయండి.. ఇది బెంగాల్.. ఖేలా హోబ్ అని ట్వీట్ చేశారు. శనివారం జరిగిన తొలి దశ పోలింగ్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 30 స్థానాలనూ గెలుచుకుంటుందని పేర్కొన్నారు.
అంతకుముందు అమిత్షా స్పందిస్తూ పశ్చిమ బెంగాల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. తొలి దశ పోలింగ్ జరిగిన 30 నియోజకవర్గాల్లో 26 స్థానాలు బీజేపీవేనని పేర్కొన్నారు.