హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): చంటిబిడ్డలకు పాలిచ్చే తల్లుల గౌరవం కాపాడేలా ఆర్టీసీ వినూత్న చర్యలు ప్రారంభించింది. బస్స్టాండ్లలో ‘అమ్మకు గౌరవం’ పేరిట బస్స్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్లను ఏర్పాటుచేస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో, కరీంనగర్, మిర్యాలగూడ బస్స్టాండ్లలో ఏర్పాటుచేశారు. వాసవీక్లబ్, రోటరీ క్లబ్ వంటి సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. త్వరలోనే అన్ని బస్స్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్విట్టర్లో తెలిపారు.