జమ్ముకశ్మీర్ : జమ్ముకశ్మీర్లోని గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నారంగ్ అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం ఉదయం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం బయటపడింది.
ఇక్కడి నుంచి రెండు ఏకే-47 తుపాకులను, గ్రెనేడ్లను, 30 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై నిన్న ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరిన విషయం తెలిసిందే. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది. అదృష్టవశాత్తు జవాన్లు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.