న్యూఢిల్లీ: మిగ్21 యుద్ధ విమానం ఇవాళ ప్రమాదానికి గురైంది. భారతీయ వైమానిక దళం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. ఈ ప్రమాదంలో ఆ విమాన గ్రూపు కెప్టెన్ మృతిచెందాడు. యుద్ద శిక్షణ విన్యాసాలు నిర్వహించేందుకు విమానం టేకాఫ్ తీసుకున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే ఏ ఎయిర్బేస్ వద్ద ఈ ఘటన జరిగిందన్న అంశాన్ని మాత్రం వైమానిక దళం వెల్లడించలేదు. ఎయిర్ ఫోర్స్ గ్రూపు కెప్టెన్ ఏ గుప్తా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ గుప్తా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం, అతని కుటుంబసభ్యులకు అండగా నిలుస్తం, ఈ ప్రమాదం పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వెయిరీకి ఆదేశించామని ప్రకటనలో పేర్కొన్నారు.