ఢిల్లీ, జూన్ 25: 25ఏండ్లుగా మైక్రోసాఫ్ట్ ద్వారా నెటిజన్లకు సేవలు అందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఇక క్లోజ్ కానుంది. వచ్చే ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ వెబ్బ్రౌజర్ను విండోస్95తో కంపెనీ విడుదల చేసింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 డెస్క్టాప్ అప్లికేషన్కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించామని,విండోస్ 10కి చెందిన కొన్ని వర్షన్లలో 2022 జూన్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండవని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రాం మేనేజర్ సీన్ లిండర్సే తెలిపారు.
విండోస్ 10లో ఇక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చూస్తామని, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వేగవంతమైనది కావడంతో పాటు మరింత సురక్షితమని తెలిపారు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను మించిన వినూత్న బ్రౌజింగ్ అనుభూతిని అందిస్తుందన్నారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోడ్ ఉంటుందని,దీంతో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆధారిత వెబ్సైట్స్,అప్లికేషన్లకు యాక్సెస్ కావొచ్చని ఆయన తెలిపారు.