రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ (5) పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ (31 నాటౌట్) నిలకడగా ఆడుతుండటంతో ముంబై పోరాడుతోంది.
ఈ క్రమంలోనే తొలి పవర్ప్లే ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని చెరో వికెట్ తీసుకున్నారు. ఆరో ఓవర్లో కృష్ణ ఖాతాలో మరో వికెట్ చేరాల్సింది. కానీ తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంలో సైని విఫలమయ్యాడు. లేదంటో ముంబై మరో వికెట్ కోల్పోయేదే.