ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ గత అక్టోబర్లో ఫ్లాగ్షిప్ ఫోన్ Mi 10T 5G సిరీస్ను ఆవిష్కరించింది. 10T సిరీస్లో Mi 10T, Mi 10T ప్రొ, Mi 10T లైట్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. షియోమీ 6జీబీ + 128జీబీ, 8జీబీ + 128జీబీ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ఎంఐ 10టీ ఫోన్ను మాత్రమే భారత్లో రిలీజ్ చేసింది. ఈ వేరియంట్ల ధర వరుసగా రూ.35,999, రూ.37,999గా నిర్ణయించింది.
ఇప్పుడు ఈ ఫోన్పై షియోమీ రూ. 3,000 వరకు తగ్గింపును ప్రకటించింది. 3వేల తగ్గింపుతో ఎంఐ10టిని ఇప్పుడు వరుసగా రూ.32,999, రూ.34,999కు కొనుగోలు చేయొచ్చు. సవరించిన ధరలు ఎంఐడాట్కామ్, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లలో వర్తిస్తుంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్లు ఉన్నాయి.