ముంబై: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్తో కాకుండా పేపర్తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది. ప్లాస్టిక్ జెండాలు పేపర్ వాటిలా పర్యావరణంలో కలిసిపోవని, అలాగే బయటపడవేయడం సరైంది కాదని పేర్కొంది. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002 ప్రకారం పేపర్తో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.