ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలు అందించడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారాన్ని అందించేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, రిలయన్స్ జియో నెట్వర్క్ తో భాగస్వామ్యం చేసుకున్నది.
ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్వర్క్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్యూవీలో ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్వర్క్తో చేతులు కలిపినట్లు ఎంజీ మోటార్స్ ప్రసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా తెలిపారు.