అమరావతి : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్మికులు నూతన పద్దతుల్లో నిరసనలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామ్దాస్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా నిరసనల మెసేజ్లను పంపారు. విశాఖను ప్రైవేటీకరిస్తూ గత యేడాది కేంద్రం నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు కర్మాగారంలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాలు పరిరక్షణ సమితి పేరిట ఐక్య వేదికగా ఏర్పడ్డాయి.
ఏడాది కాలంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రులకు మెసేజ్లు, ఈమెయిళ్ల ద్వారా నిరసనలకు పిలుపునిచ్చాయి. ‘‘ STOP SALE OF VIZAG STEEAL PLANT ’’ పేర ఈనెల 21 వరకు మెసేజ్లు, మెయిల్స్ను పంపించాలని కోరడంతో తొలిరోజు శుక్రవారం కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్పందించి నిరసనలు తెలిపారు.