పుణె, అక్టోబర్ 3: మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ స్వెంక్కు మహారాష్ట్రలోని పుణెలో ట్రాఫిక్తో చుక్కలు కనిపించాయి. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ ఎస్ క్లాస్ కారు నగరంలోని ఓ రోడ్డులో భారీ ట్రాఫిక్లో చిక్కుకున్నది. అటూ ఇటూ కదిలేందుకు వీలులేని పరిస్థితి. దీంతో కారు దిగిన ఆయన ఓ ఆటో మాట్లాడుకొని తాను చేరాల్సిన గమ్యానికి చేరారు.
తనకు ఎదురైన ఈ ట్రాఫిక్ అనుభవాన్ని మార్టిన్ స్వెంక్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకొన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో సీటులో నుంచి తీసిన ఫొటోను షేర్ చేశారు. స్వెంక్ పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు తమకు ఎదురైన ట్రాఫిక్ అనుభవాలను పంచుకున్నారు.