అమీర్పేట్:తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్గౌడ్ సోమవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సెప్టెంబర్ 1న కమిషన్ సభ్యునిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని నూతన సభ్యుడు కిశోర్గౌడ్ను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.