బేగంపేట్ అక్టోబర్ 3: ప్రజల అవసరాలను తెలుసుకొని తీర్చగలిగేవాడే నిజమైన నాయకుడని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు చెప్పారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో సోమవారం రామానందతీర్థ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద కేకే పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరిశంకర్, మాజీ ప్రధాని పీవీ తనయుడు పీవీ ప్రభాకర్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.