న్యూఢిల్లీ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్, సభ్యుల ఎంపిక కోసం కమిటీ ఈ నెల 31న సమావేశం కానుంది. 7 లోక్ కల్యాణ్ మార్గ్లో సమావేశం జరుగుందని, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్, ఇతర సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డెప్యూటీ చైర్మన్, రాజ్యసభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఇంతకు ముందు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు పని చేశారు. 2020, డిసెంబర్ 2న ఆయన పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి పదవి ఖాళీగానే ఉంది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రఫుల్లా చంద్ర పంత్ ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు.