సిద్దిపేట : ప్రేమ విఫలమైందని మెడికల్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గురువారం చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల మధిర గ్రామమైన పీసీ తండాకు చెందిన మెగావత్ సంతోష్కుమార్(21) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో పరీక్ష ఉందని కాలేజీకి వెళ్లి మళ్లీ కొద్ది సేపటి తరువాత హాస్టల్ గది నెం.109 లోకి తిరిగి వచ్చి ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడని తెలిపారు. అయితే ప్రేమ విఫలమైనందునే తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసినట్లు ఏసీపీ వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.