ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 7 : వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధి… ప్రతాపసింగారంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పప్పు దినుసులు, నూనె గింజల అవసరానికి పంటల ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉన్నదని తెలిపారు. రైతులు ఇతర పంటలైన పప్పు జాతి, నూనె గింజల పంటలను సాగు చేయాలని సూచించారు. మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో ఇతర పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు.
2014-15వ సంవత్సరంలో రాష్ట్రంలోని వరి విస్తీర్ణం 34.92 లక్షల ఎకరాలు ఉండగా 2020-21 సంవత్సరంలో కోటి 6 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. వానాకాలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేయడం వల్ల మార్కెట్లో అమ్మకాలకు ఇబ్బందులు తలెత్తి రైతులపై వత్తిడి భారం పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర పంటల సాగు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి మేరీరేఖ, మండల రైతుబంధు అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మండల వ్యవసాయాధికారి ఎంఏ బాసిత్, సర్పంచ్ శివశంకర్, రైతుబంధు నాయకుడు సుభాష్ రెడ్డి, బాల్రాజు, ఏఈఓ జగదీశ్ పాల్గొన్నారు.
కీసర : యాసంగిలో వరి పంటకు బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి మాధవీలత తెలిపారు. మండల పరిధిలోని భోగారం, బర్సీగూడ గ్రామాల్లో రైతులకు మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓఏ వెంకట్రాంరెడ్డి, భోగారం సర్పంచ్ కవిత జైహింద్రెడ్డి, ఉప సర్పంచ్ జానకీరాం, ఏఈఓ వరలక్ష్మితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
శామీర్పేట : యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని రైతుబంధు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్, బొమ్మరాశిపేట, పొన్నాల్, మజీద్పూర్ గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ అధికారులు, రైతుబంధు కమిటీ సభ్యులు రైతుల వద్దకు వెళ్లి వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమార్, వ్యవసాయ అధికారి రమేశ్, ఏఈవో రవి, ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డి, రైతులు జగన్మోహన్రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.