బాలానగర్, ఆగస్టు 13 : నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు కేంద్ర హోంశాఖ అందజేసే మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022 అవార్డుకు బాలానగర్ ఏసీపీ గంగారాం ఎంపికయ్యారు.
2017లో గంగారాం అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కాలంలో ఓ లైంగికదాడి కేసుకు సంబంధించి సరైన ఆధారాలు సేకరించి.. సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయడంతో నిందితుడికి న్యాయస్థానం 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 2వేల జరిమానా విధించింది.