ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. సంగారెడ్డి జిల్లాలో ద్వితీయ సంవత్సరం మొత్తం 14,251 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 9,251 మంది పాసయ్యారు. 64శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలువగా, మొదటి సంవత్సరం 58శాతంతో 12వ స్థానం సాధించింది. సెకండ్ ఇయర్లో 6,883 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా, 4,906 మంది పాసయ్యారు. బాలుర కంటే 13 శాతం అధిక ఉత్తీర్ణత పొందారు. ఫస్టియర్లో 9,130 మంది పరీక్ష రాయగా, 6,234 మంది పాసై 68 శాతంతో బాలుర కంటే 23శాతం ఉత్తీర్ణత సాధించారు. మెదక్ జిల్లాలో మొదటి సంవత్సరంలో 40 శాతం, రెండో సంవత్సరంలో 47 శాతంతో రిజల్ట్స్లో రాష్ట్రంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇక్కడ కూడా బాలికల హవా కొనసాగింది. మొదటి సంవత్సరం బాలురతో పోల్చితే 22 శాతం, రెండో సంవత్సరం 21 శాతం ఉత్తీర్ణత పొందారు.
మెదక్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో మెదక్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 40శాతం మాత్రమే ఫలితాలు రాగా, రెండో సంవత్సరంలో 47శాతం నమోదైంది. మంగళవారం ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. సెకండియర్కు సంబంధించి పరీక్షలకు 5906 మంది హాజరుకాగా, కేవలం 2823మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 47శాతం ఉత్తీర్ణతే నమోదైంది. మొదటి సంవత్సరానికి సంబంధించి 6621 మంది పరీక్షకు హాజరుకాగా 2683మంది ఉత్తీర్ణులయ్యారు. 40శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా అట్టడున నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
బాలికలే టాప్..
ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్గా నిలిచారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు బాలురు 3067 మంది హాజరు కాగా, కేవలం 887మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కేవలం 28 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3554మంది హాజరుకాగా, 1796మంది ఉత్తీర్ణత పొందారు. 50శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2797 మంది బాలురు హాజరయ్యారు. ఇందులో 1026మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 36శాతం నమోదైంది. బాలికలు 3109 మంది హాజరుకాగా, 1797మంది ఉత్తీర్ణత సాధించారు. 57శాతం ఉత్తీర్ణత కాగా బాలుర కంటే 21శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు.
గత ఐదేండ్లుగా..
2017-18లో మొదటి సంవత్సరంలో 6,756మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,864మంది ఉత్తీర్ణత సాధించి 42శాతం నమోదైంది. దీంతో రాష్ట్ర స్థాయిలో 20వ స్థానంలో నిలిచారు. 2018-19లో 7,028 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,054మంది ఉత్తీర్ణత సాధించారు. 29శాతం నమో దై రాష్ట్రంలో 21స్థానంలో నిలిచారు. 2019-20లో 7,700 మంది పరీక్షలు రాయగా, 2,753 మంది ఉత్తీర్ణులయ్యారు. 36 శాతం నమోదై రాష్ట్రంలో 33వ స్థానంలో నిలిచింది. రెండో సంవత్సరంలో 2017-18లో 6,291మంది పరీక్షలకు హాజరు కాగా 3,088మంది ఉత్తీర్ణత సాధించారు. 49శాతం నమో దు కాగా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచారు. 2018-19లో 5,780మంది పరీక్షలు రాయగా, 1,972 మంది ఉత్తీర్ణులయ్యా రు. 34శాతం నమోదైంది.
రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచారు. 2019-20లో 6,040మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, 2,818 మంది ఉత్తీర్ణత సాధించారు. 47శాతం నమోదు కాగా, రాష్ట్రంలో 33వ స్థానంలో నిలిచారు. ఇదిలావుండగా 2020-21లో కరోనా కారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడలేదు. మొత్తం విద్యార్థులకు గాను ఆల్పాస్గా చూపించారు. 2021-22లో ప్రథమ సంవత్సరంలో 6621మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరు కాగా 2683మంది ఉత్తీర్ణత సాధించారు. 40శాతం నమోదైంది. సెకండియర్లో 5906మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2823మంది ఉత్తీర్ణత సాధించారు. 47శాతం నమోదైంది. కానీ ఈ సంవత్సరంలో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఇంటర్ ఫలితాలు విడుదల
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 28: ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో 64శాతంతో జిల్లాకు 21వ స్థానం లభించగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో 12వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 14,251 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 9,251 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 7,368మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 4,345 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 58శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలకు సంబంధించి మొత్తం 6,883మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు కాగా, 4,906మంది ఉత్తీర్ణు లై 71శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలు 13 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి మరోసారి వారి ప్రతిభను కనబరిచారు. అదే విధంగా మొదటి సంవత్సరం ఫలితాల్లో భాగంగా మొత్తం 15,777 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 9,239 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
58శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురకు సంబంధించి 6,647మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, కేవలం 3,005 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 45శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలకు సంబంధిం చి మొత్తం 9,130మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు కాగా 6,234మంది ఉత్తీర్ణులై 68శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక్కడ కూడా బాలుర కంటే బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా 23శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ ఆధిక్యతను నిలబెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాగంగా ద్వితీయ సంవత్సరంలో కరోనా కారణంగా 100శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. మొదటి సంవత్సరంలో 48శాతం ఉత్తీర్ణత నమోదైంది.
వొకేషన్ కేటగిరీలో…
వొకేషనల్ కేటగిరీలో ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి మొత్తం 1,211మంది విద్యార్థులు పరీక్ష రాయ గా, 808మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 66శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా మొదటి సంవత్సరం వొకేషనల్ ఫలితాల్లో మొత్తం 1,416మంది విద్యార్థులకు గాను 849మంది విద్యార్థులు పరీక్ష రాసి 59శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ద్వితీయం సంవత్సరం వొకేషనల్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో ఉండగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచింది.
అక్కాతమ్ముడికి సమాన మార్కులు
నారాయణఖేడ్, జూన్ 28: ఇంటర్ ఫలితాల్లో నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అక్కాతమ్ము డు ఇద్దరికి సమానమైన మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జేట్ల శ్రీవేణిక, జేట్ల చందులు అక్కా తమ్ముడు కాగా శ్రీవేణిక బీపీసి ద్వితీ య సంవత్సరం, చందు ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా మంగళవారం వెలువడిన ఫలితాల్లో అనూహ్యంగా శ్రీవేణికకు 968 రాగా చందుకు తత్సమానంగా 968 మార్కులే వచ్చాయి. అయితే అక్కాతమ్ముైళ్లెన వారిద్దరికి సమానమైన మార్కులు రావడం కాస్త చర్చనియాంశమైంది. ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలతో పోటీ పడి మంచి మార్కులు సాధించడంపై ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్ విద్యార్థులను అభినందించారు.