దుబ్బాక, అక్టోబర్6: నియోజకవర్గంలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం పర్యటించనున్నారు. దుబ్బక పట్టణం, మిరుదొడ్డి, చేగుంట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొంటారు. దుబ్బాకలో ఉదయం 10.30 గంటలకు స్థానిక లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం వద్ద నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సమూదాయం, దుబ్బాకలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. ఆనంతరం 11 గంటలకు స్థానిక రజనీకాంత్ ఫంక్షన్హాల్లో దుబ్బాక వ్యవసాయ ఆత్మకమిటీ , దౌల్తాబాద్, తొగుట మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు (మిరుదొడ్డి) భూంపల్లి అక్బర్పేట మండలంలో అక్బర్పేటలో డీసీసీబీ బ్యాంకు, ఎస్సీ కమ్యూనిటీ భవనాల ప్రారంభోత్సవం, 2.30 గంటలకు భూంపల్లిలో పీఏసీఎస్ గోదాం ప్రారంభోత్సవం, 3 గంటలకు వీరారెడ్డిపల్లిలో రైతు వేదిక ప్రారంభోత్సవం, నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, 3.15 గంటలకు అల్మాస్పూర్లో రైతు వేదిక, వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం, సాయంత్రం 4 గంటలకు చేగుంటలో నూతన తహసీల్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయ భవనాల ప్రారంభోత్సవం, సాయంత్రం 5 గంటలకు చేగుంట పర్యటన అనంతరం రాత్రి 7 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు.