గుమ్మడిదల, సెప్టెంబర్27: దేవీశరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా భద్రకాళీ అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో పూజలందుకున్నారు. మంగళవారం మండలంలోని బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయంలో భద్రకాళీదేవి రెండోరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. ఉత్సవాలు ఈవో శశిధర్గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఆలయవతనుధారులు ఆలేటి జగన్మోహన్రెడ్డి, ధర్మకర్తలు లక్ష్మీనారాయణ, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
నీలివర్ణపు చీరలో దుర్గామాత
ఝరాసంగం, సెప్టెంబర్27: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయ మండపంలో మంగళవారం గాయిత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నీలవర్ణం రంగు చీరతో ఆలయ అర్చకులు అలంకరణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శివకుమార్స్వామి, వీరన్న, అర్చకులు వీర్సంగయ్యస్వామి, శివప్రపాద్, హరిమహరాజ్జోషీ, ప్రవీణ్స్వామి భక్తులు ఉన్నారు.