సిద్దిపేట, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల సంఘాలకు పూర్వ వైభవం వచ్చింది. గొల్ల, కుర్మల అభివృద్ధికి గొర్రెల పంపిణీ, మత్స్యకారుల అభివృద్ధికి ఉచితంగా చేప పిల్లల పంపిణీ, గీత, చేనేత వర్గాల సంక్షేమ కోసం ప్రత్యేక నిధులు, దళితుల అభ్యున్నతికి దళితబంధు, త్వరలోనే దళిత బంధు తరహాలోనే గిరిజనుల అభివృద్ధికి గిరిజన బంధు, నాయీ బ్రాహ్మణులకు సెలూన్ షాపులకు, రజకులకు లాండ్రి షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి రుణాలు, అంబేద్కర్ ఓవర్సీస్ పథ కం, బీసీ, ఎస్సీ గురుకులాల బలోపేతం, ఆయా సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు..
ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే రోల్ మోడల్గా ఉంచారు సీఎం కేసీఆర్. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాడుపడుతూ సీఎం కేసీఆర్ అందరి బంధువయ్యాడు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు సబ్బండ వర్గాలకు మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలోనే కుల వృత్తులకు ఎంతో గౌరవం దక్కింది. ప్రతి కులానికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పథకాలను ప్రవేశపెట్టి సామాన్య ప్రజలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. గతంలో ఏ ప్రభు త్వం ఇవ్వని విధంగా కులాల వారీగా నిధులు కేటాయించి.. ప్రత్యేక భవనాల నిర్మాణాలు చేపట్టడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, వెనుకబడిన కులాల సంక్షేమం కోసం కృషి చేస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అన్ని పండుగలకు గుర్తింపు ఇస్తున్న నేత సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యం
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యం. మత రాజకీయాలతో పబ్బం గడుపుతున్న బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడే రాజకీయ సమీకరణలకు సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశం ఇప్పటికే మతహింసతో అట్టుడుకిపోతున్నది. తెలంగాణ వస్తే ఏం వస్తుందో ఆచరణలో చేసి నిరూపించిన ఘనత కేసీఆర్కే దక్కింది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి మోడల్గా మారాయి. నేడు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివిధ పేర్లతో దేశంలో అమలు చేస్తున్నారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి, ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. – కుంభాల శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సత్తా ఉన్న పీఎం అభ్యర్థి కేసీఆరే
ప్రస్తుతం దేశానికి సత్తా ఉన్న నేత సీఎం కేసీఆర్ ఒక్కరే. రాష్ట్ర రాజకీయాల్లో అందరిమన్ననలు పొందుతున్న సీఎం దేశ రాజకీయాల్లోకి రావడాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో మోదీని ఎదిరించే నాయకుడు, సమస్యలను పరిష్కరించే నేత సీఎం కేసీఆర్ మాత్రమే. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న మన సీఎం దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టే సమర్ధుడు.
– గ్యారల మల్లేశ్ముదిరాజ్,ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు, గుమ్మడిదల
జాతీయ రాజకీయాల్లోకి రావాలి
దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలన్నా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. పేదల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ దేశ పాలకుడు కావాల్సిన అవసరముంది. దేశంలో అన్ని మతాలకు సముచిత స్థానం దక్కాలంటే కేసీఆర్తోనే సాధ్యం. దేశంపై అణువణువు అవగాహన ఉన్న నేత, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా అభివృద్ధి చెందుతుంది.
– బట్టి జగపతి, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మెదక్ మున్సిపాలిటీ
కేసీఆర్తోనే దేశ ప్రజలకు ఉపయోగం..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి తప్పకుండా రావాలి. పేదలను ఆదుకునే మంచి మనసున్న కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. తెలంగాణలో ఉన్న పథకాలు అన్నీ కూడా దేశంలోని ప్రజలందరికీ లభిస్తాయి. అప్పుడు అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
– అంజయ్యగౌడ్,కోహీర్ మండల గౌడ సంఘం అధ్యక్షుడు
కేసీఆర్ ప్రధాని కావాలి..
ఉద్యమ నాయకుడైన కేసీఆర్కు దేశంలోని రైతులు, ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిసున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశ ప్రజలందరికీ అందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రధాని కావాలి.
– ఆది బాల్రాం, మున్నూరు కాపు పట్టణ అధ్యక్షుడు, మెదక్ మున్సిపాలిటీ
దేశ రాజకీయాలకు వెళ్లాలి
దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లాలి. అప్పుడే మన రాష్ట్రంతో పాటు దేశం బాగుపడుతుంది. మన తెలంగాణ పథకాలు దేశంలో అందరికీ అందాలి. ఇటువంటి నాయకుడు ఉన్నన్ని రోజులు దేశం సుభిక్షంగా ఉంటుంది.
– దేమె యాదగిరి, మున్నూరుకాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామాయంపేట
దేశ ప్రజలకు మన పథకాలు అందాలి
రాష్ట్రంలో అమలు చే స్తున్న సంక్షేమ పథకా లు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు ద క్కాలి. తెలంగాణలో నే కాకుండా దేశంలో ని అన్ని రాష్ర్టా ల్లో ఈ పథకాలను ప్రజలకు చేర్చాలంటే, అది కేసీఆర్తోనే అవుతుంది. అందుకోసమే కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలి.
– సంగు స్వామి, రజక సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు, రామాయంపేట
కేసీఆర్తోనే అందరికీ న్యాయం
తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల వారికీ సమన్యాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్. దేశంలోని ఏ రాష్ర్టాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు లేవు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగాలంటే సీఎం సార్ దేశరాజకీయాలకు వెళ్లాలి.
– నాళం కిష్టాగౌడ్, జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షుడు, రామాయంపేట
శక్తిగల నాయకుడు సీఎం కేసీఆర్
దేశంలో ఏ నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి చేయలేదు. ఇంత మంచి పథకాలను అందిస్తున్న కేసీఆర్ దేశానికి ప్రధాన మంత్రి కావాలి. అప్పుడే దేశ ప్రజలకు ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలు అందుతాయి.
– మద్దెల రమేశ్, పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు, రామాయంపేట