హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో కెనాల్ నుంచి హల్దీ వాగులోకి విడుదల చేశారు. అక్కడినుంచి నీరు నిజాంసాగర్కు చేరుకుంటుంది. అదేవిధంగా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్, మెదక్ జిల్లా నేతలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, డి. రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మాణిక్ రావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎలక్షన్ రెడ్డి పాల్గొన్నారు.