రాయికోడ్ మండలం శాపూర్ గ్రామంలో సాగు
తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం
పంటకు అన్ని నేలలు అనువు
యాసంగిలో సాగుకు అనుకూలం
ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడి
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు
రాయికోడ్ వ్యవసాయ శాఖ ఏడీఏ హరిత ప్రత్యేక కృషి
రాయికోడ్, మార్చి 28 : రైతులు నూతన రకమైన పంటలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శాపూర్ గ్రామంలో ఓ రైతు 6 గుంటల పొలంలో కినోవా పంటను సాగు చేస్తున్నాడు. ఈ పంటను యాసంగిలో నీటి వసతి కింద అక్టోబర్ మొదటి 15 రోజుల నుంచి నవంబర్ మొదటి 15 రోజుల వరకు సాగు చేసుకోవచ్చు. పంట అన్ని రకాల భూముల్లో వేసుకోవచ్చు. ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. పంటలో మాంసకృత్తులు, లైసీన్, మితియోనిన్ లాంటి అమైనో ఆమ్లాలు, బీ,ఈ విటమిన్లు, సూక్ష్మ పోషకాలు, పీచుపదార్థాలు ఉంటాయి.
పంటల లాభాలు…
ఉమ్మడి మెదక్ జిల్లా రాయికోడ్ మండలంలోని శాపూర్ గ్రామంలో పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను రైతుల నుంచి నేరుగా వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు చేస్తారు. పంటను రైతులు అనువుగా సాగుచేసుకోవచ్చు. బీపీ, షుగర్ ఉన్న వారికి ఈ పంట ఎంతో మేలు చేస్తున్నది. రాజస్థాన్, ఇతర దేశాల్లో మాత్రమే సాగుచేస్తారని రాయికోడ్ వ్యవసాయ శాఖ ఏడీఏ హరిత తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ పొలాల్లో సాగుచేసుకోవాలని సూచించారు. ఎరువులు, విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తామన్నారు.
పంట ప్రాముఖ్యత : దీనిలో 14-18 శాతం మాంసకృత్తులు, లైసీన్, మితియోనిన్ అరుదైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు (బీ,ఈ) సూక్ష్మపోషకాలు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పీచుపదార్థాలు ఉంటాయి.కినోవా వెడల్పు లాంటి ఆకులు గల ఏకవార్షిక ఆహార పంటఈ పంట సుమారు 1.0-1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.వీటి విత్తనంపై పొరలో సోపోనిన్లు ఉండటంతో చేదు రుచి, వస్తున్నది. విత్తనంపై పొరను తప్పని సరిగా తీసి వాడాలి.
ఇవి కూడా చదవండి..
ఇది తింటే.. కేవలం 4 గంటల్లోనే షుగర్ తగ్గుతుందట..!
వేసవిలో సగ్గుబియ్యం తినడం మరిచిపోకండి..!