మెదక్, అక్టోబర్ 26 : పంట పొలాల్లో గం జాయి సాగు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. మంగళవారం తన చాంబర్లో గంజాయి సాగు, కరోనా వ్యాక్సినేషన్పై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… గంజాయి సాగుచేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లో అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 1283 మొక్కలను ధ్వసంచేశామని ఆబ్కారీ అధికారి తెలిపారు. అల్లాదుర్గం మండలంలోని వెంకట్రావ్పేటకు చెందిన చాకలి రాములు సర్వే నం బర్ 27లో సాగుచేస్తున్న 78 మొక్కలను ధ్వం సం చేశామని అదనపు ఎస్పీ కలెక్టర్కు చెప్పారు. వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి గంజాయి సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో హవేళీఘనపూర్, రేగోడ్, అల్లాదుర్గం తదితర మండలాల్లో గంజాయి సాగుచేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. మెదక్లో స్టేడియం పను లు త్వరితగతిన పూర్తిచేయాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి, జడ్పీ సీఈవో శైలేష్, ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ రజాక్, డీపీవో తరుణ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఎస్వో శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి పరుశురాంనాయక్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ పాల్గొన్నారు.