రామాయంపేట, అక్టోబర్ 23: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. శనివారం రామాయంపేటలోని మధుర గార్డెన్లో టీఆర్ఎస్ విస్తృతస్తాయి సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడ లేని పథకాలు కేవలం రా ష్ట్రంలో ఉన్నాయన్నారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్టాన్ని విభేదించిన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ఎందుకు తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ అని పేర్లు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. నవంబర్ 15న జరిగే వరంగల్ విజయగర్జనకు ప్రతి గ్రామం, మున్సిపల్ కౌన్సిలర్కు ఒక్క బస్సును సమకూరుస్తున్నామన్నారు. కౌన్సిలర్ పరిధిలో ఉన్న బస్సును ఆ వార్డు కౌన్సిలర్ కార్యకర్తలను తీసుకొని రావాలన్నారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, పట్టణాధ్యక్షుడు నాగరాజు, రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభావతి, పట్టణ కౌన్సిలర్లు దేమె యాదగిరి, సరాఫ్ సౌజన్య, గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
విజయ గర్జనను విజయవంతం చేయాలి
ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు
నిజాంపేట,అక్టోబర్23: వరంగల్లో నవంబర్ 15న నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. శనివారం ఆయన మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే అన్నారు. ప్లీనరీ, విజయ గర్జనకు సంబంధించిన అంశాలను చర్చించుకునేందుకు నేడు నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో నిర్వహించనున్న మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, టీఆర్ఎస్ యూత్ నాయకుడు లక్ష్మణ్ ఉన్నారు.
నేడు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
పెద్దశంకరంపేట,అక్టోబర్23: టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గురుపాద గుట్ట శివాలయం సమీపంలో నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆసూరి మురళీపంతులు శనివారం తెలిపారు. ఈ సమావేశానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి హాజరవుతారన్నారు. కార్యక్రమానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ కమిటీలు, మండల కమిటీ కార్యవర్గంతో పాటు గ్రామ పార్టీ కార్యవర్గ సభ్యలు, పార్టీ ముఖ్య నాయకులు, టీఆర్ఎస్ అభిమానులు హాజరై విజయవంతం చేయాలన్నారు