వ్యవస్థను రూపొందించిన ఎంసీఈఎంఈ
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ)/బొల్లారం: రోడ్డు ప్రమాదాల నివారణకు మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో పనిచేసే పరికరాన్ని రూపొందించారు. దీనిని గురువారం ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో కమాండెంట్ టీఎస్ఏ నారాయణన్.. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్కు అందించారు. ఎంసీఈఎంఈ ఆధ్వర్యంలో ఇటీవల పలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టారు. భారీ వాహనాల ప్రమాదాల నివారణకుగాను ఆర్టీవో ఆధ్వర్యంలో దీన్ని ఉపయోగించి పనితీరును పరిశీలిస్తారు. కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్కుమార్ మక్తల పాల్గొన్నారు.