ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ లో పట్టాలపై పడిపోయిన చిన్నారిని రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, రైల్వే శాఖ తమ ఉద్యోగిని అభినందించింది. తోటి ఉద్యోగులు సైతం గ్రాండ్ వెల్ కమ్ తో అతనికి స్వాగతం పలికారు.ముంబయి రైల్వే అధికారులు ఆ సాహస వీరుడిని సత్కరించడంతో పాటు నగదు బహుమతి కూడా అందించారు.