లక్నో : స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందు యూపీలో చెలరేగిన హింసాకాండ పట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి యోగి ఆదిత్యానాధ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై శనివారం విమర్శలతో విరుచుకుపడ్డారు. చందౌలీ జిల్లాలో దళితుల ఇండ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ యూపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
యోగి పాలనలో చట్టం లేదన్న మాయావతి లఖీంపూర్ ఖేరిలో మహిళ పట్ల కాషాయ పార్టీ కార్యకర్తల దురుసు ప్రవర్తనను ఆక్షేపించారు. దళితుల ఇండ్లను ధ్వంసం చేస్తున్నా అదే వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. ఇంతజరిగినా యూపీ క్యాబినెట్లో దళిత మంత్రులు మౌనంగా ఉన్నారని వరసు ట్వీట్లలో మాయావతి మండిపడ్డారు.