మునుగోడు : టీఆర్ఎస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మునుగోడు జడ్పీటీసీ సభ్యులు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇవాళ మునుగోడు, చండూరు, శివన్నగూడెంకు చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలకు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అవుతుందని అన్నారు. బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారినంత మాత్రాన టీఆర్ఎస్కు జరిగే నష్టమేమి లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరుతున్నామని బీజేపీ నాయకులు వెల్లడించారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో..
మునుగోడు నియోజకవర్గ బీజేపీ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, నల్లగొండ జిల్లా ఓబీసీ జనరల్ సెక్రటరీ మాదగోని నరేందర్ గౌడ్, నల్లగొండ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎం.డీ మాజీద్, బీజేవైఎం నల్లగొండ జిల్లా సెక్రటరీ పందుల రాజేశ్, దళిత మోర్చా మునుగోడు అసెంబ్లీ కన్వినర్ నీరుడు రాజారామ్, బీజేపీ మహిళా మోర్చా మునుగోడు మండల అధ్యక్షురాలు ముచ్చపోతుల స్రవంతి, నల్లగొండ జిల్లా దళిత మోర్చా అధ్యక్షురాలు రాజలక్ష్మి, దళితమోర్చా మండల ప్రధాన కార్యదర్శి జీడిమెట్ల రమేష్, మునుగోడు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు పారణె అంతిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
చండూరు మండలం నుంచి..
చండూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు తిరoదాసు అనితాంజనేయులు , షేరిగూడెం ఉపసర్పంచి పంకెర్ల వెంకటేశ్ , షేరు గూడెం బీజేపీ వార్డు మెంబర్ పంకెర్ల స్వామి , లంకలపల్లి గ్రామం నుంచి సర్పంచ్ పాక్ నాగేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు పగిళ్ల రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోడ భిక్షం , వడ్డెర సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి వరికుప్పల వేంకటేశం టీఆర్ఎస్లో చేరారు. ముదిరాజ్ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి వెంకన్న , గౌడ సంఘం కోశాధికారి కర్నాటి శ్రీను , దాసరి లింగయ్య కోటగొని రమేశ్ ,మధి స్వామి, దాసరి కుమార్ , వరికుప్పల ప్రసాద్ ,కొంగల నవీన్, పగిళ్ల హరీష్ , జంపాల ఆంజనేయులు టీఆర్ఎస్లో చేరారు.
శివన్నగూడెం నుంచి..
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నూనె కొలుపుల పెద్దలు యాదవ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు, ఎంపీటీసీ సభ్యులు గండికోట హరికృష్ణ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన వందమందికి పైగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.