ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరల్ బాగ్లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని చెప్పారు.
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఘజియాబాద్లో పారిశ్రామిక వాడలో ఉన్న సబ్బుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.