Maruti Suzuki YY8 Electric SUV | ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. గత సంవత్సరం నుంచి ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్లో ప్రవేశపెట్టాయి. మహీంద్రా, టాటా నుంచి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. మారుతీ సుజుకీ కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రారంభించింది. 2024లోపు వాగనార్ మోడల్లో ఈవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు టయోటాతో టైఅప్ అయిన మారుతీ సుజుకీ.. 2025 లోపు సరికొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీల కన్నా బెస్ట్ ఫీచర్లతో.. వాటి కన్నా పెద్ద పరిమాణంలో ఈ కారును తీసుకొచ్చేందుకు మారుతీ సుజుకీ, టయోటా సన్నాహాలు చేస్తున్నాయి.
4.2 మీటర్ల పొడవుతో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని డిజైన్ చేస్తున్నారు. 2.7 మీటర్ల వీల్బేస్ పొడవు, 48 కేడబ్ల్యూహెచ్, 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు, 138 పీఎస్ ఎలక్ట్రిక్ మోటర్, లియాన్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈవీ రానుంది.
2025 లోపు ఈ కారును లాంచ్ చేసేందుకు మారుతి, టయోటా ప్లాన్ చేస్తుండగా.. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లను దీటుగా బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఈవీని తీసుకురావడం కోసమే జపాన్ దిగ్గజం టయోటా కంపెనీతో మారుతీ సుజుకీ జతకట్టింది.