Maruti New S-Presso | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం మార్కెట్లోని ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ మోడల్ ఎస్-ప్రెస్సో న్యూ వర్షన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.25 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్య పలుకుతుంది. మాన్యువల్ వేరియంట్ కార్లు రూ.4.25 లక్షల నుంచి రూ.5.49 లక్షలకు లభిస్తుండగా, ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) కార్ల ధరలు రూ.5.65 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్య ఉన్నాయి.
ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో న్యూ ఎస్-ప్రెస్సో మార్కెట్లోకి వచ్చింది. పూర్తి ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో లీటర్కు 25.3 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. 1.0కే-సిరీస్ ఇంజిన్తో న్యూ ఎస్-ప్రెస్సో రిఫైన్ చేసి, ఇంధన సామర్థ్యం విస్తృత పరిచారని మారుతి సుజుకి (ఎంఎస్ఐ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు.
డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, ఏజీఎస్ వేరియంట్లలో హిల్ హోల్డ్ అసిస్ట్తోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) కూడా చేర్చారు. ఎస్-ప్రెస్సో ఎస్యూవీష్ డిజైన్తో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చిందని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. కేవలం మూడేండ్లలోపే 2,02,500కి పైగా ఎస్-ప్రెస్సో కార్లు విక్రయించామన్నారు.