ముంబై: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వేడుకల్లో పాల్గొనే సంఖ్యపై ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా, కరోనా కేసుల పరంగా దేశంలోనే టాప్లో ఉన్న మహారాష్ట్రలో కొత్తగా మరో నిబంధన అమలులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో ముంబైలో వివాహ రిజిస్ట్రేషన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకున్నది.
“ముంబైలో ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా వివాహ రిజిస్ట్రేషన్ సేవను తాత్కాలికంగా నిలిపివేశాం. అపాయింట్మెంట్, తేదీ, సమయం వంటి సౌకర్యంతో ఈ సేవను త్వరలో పునఃప్రారంభిస్తాం ” అని అధికార ప్రకటనను బీఎంసీ విడుదల చేసింది. అలాగే ఆన్లైన్ మేరేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వీడియో కేవైసీ ఆప్షన్ను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.