హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు నిశ్చయించిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్తో పాటు ఈ రెండు జిల్లాలను అభివృద్ధి చేసేక్రమంలో స్థానికంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిందిగా సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించడంపై కూడా ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట, జవహర్నగర్ తదితర మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని కొనియాడారు.