రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా 98 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈ తంతు ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధనకర్ ఈ పదవి రేసులో ఉన్నారు. విపక్షాల తరఫున రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సమయంలో ఆమెతోపాటు పలువురు విపక్ష నేతలు కూడా హాజరవుతారని తెలుస్తోంది. మొత్తం 17 విపక్ష పార్టీలు కలిసి ఉపరాష్ట్రపతి పదవికి మార్గరెట్ ఆళ్వా పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 6వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి.