రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు. బిర్జురాం అనే వ్యక్తిని హత్యచేశారు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించిన జేసీబీ, బైక్ను తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పర్శాగావ్ సర్పంచ్ భర్తగా గుర్తించారు.
మరో ఘటనలో… శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కిరండోల్-విశాఖ రైల్వే మార్గంలో గూడ్సు రైలులోని ఐదు వ్యాగన్లను పట్టాలు తప్పించారు. రైలు కిరండోల్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజంతో వెళ్తున్నది. అదేవిధంగా జిర్కా అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ను మావోయిస్టులు పేల్చేశారు. ట్రాక్ ధ్వంసమవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిరండోల్ నుంచి జగదల్పూర్ వరకు రైళ్లు నిలిచిపోయాయి. అయితే జగదల్పూర్-విశాఖ మార్గంలో యధావిధిగా రైళ్లు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు.