రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలోని ఎటేపాల్ అడవుల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. అప్రమత్తమైన బలగాలు మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మద్యి కోస అనే మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మద్యి కోసపై గతంలో రూ. 5 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. మద్యి కోసపై వివిధ పోలీసు స్టేషన్లలో 20కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఎటేపాల్ అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు.