చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం మారడంతో కొందరు అభ్యర్థులు సీఈయూటీ యూజీ 2022 పరీక్ష రాయలేకపోయారు. అయితే వారికి మరో చాన్స్ ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు. పరీక్ష మిస్ అయినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తర్వలోనే ప్రకటించే అవకాశాలున్నాయన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈయూటీ యూజీ)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం (జూలై 15) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
సీయూఈటీ యూజీ 2022కి హాజరవుతున్న కొంతమంది విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చమని ఎన్టీఏను అభ్యర్థించారు. అయితే, ఎన్టీఏ చివరినిమిషంలో వారి పరీక్షా కేంద్రాలను మార్చడంతో పరీక్ష రాయలేకపోయారు. వీరికి మరో అవకాశం కల్పించనున్నట్లు ఎన్టీఏ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. కాగా, ఎన్టీఏ తప్పిదంతో తాము ఇబ్బందిపడ్డామని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.