ఇక గుండె వ్యాధిగ్రస్తులకు రిమ్స్లో సేవలు
అందుబాటులోకి ట్రికాగ్ మిషన్
నిమ్స్ నుంచి కార్టియాలజిస్ట్ సలహాలు
అవసరం ఉన్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు
24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణ
అత్యవసరమైతే వెంటనే హైదరాబాద్కు రోగి తరలింపు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఈసీజీ మిషన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇకపై గుండె వ్యాధిగ్రస్తులకు ఇక్కడే పరీక్షలు చేయనుండగా, నిమ్స్ నుంచి కార్డియా లజిస్ట్ల సలహాలు తీసుకోనున్నారు. రిపోర్టులు పరిశీలించాక, రోగి పరిస్థితికి అనుగు ణంగా ఇక్కడి వైద్యనిపుణుల ఆధ్వర్యంలో చికిత్స అందించనున్నారు. అత్యవసరమైతే హైదరాబాద్లోని నిమ్స్కు తరలించ నున్నారు. కాగా, బుధవారం అసిస్టెంట్ ప్రొఫెసర్ (డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్) తానాజీ ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు చేశారు.
ఎదులాపురం, మార్చి 31 : గుండె వ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్ర సర్కారు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రధాన దవాఖానల్లో ట్రికాగ్(ఈసీజీ మిషిన్)ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్లోని రిమ్స్లో రెండు రోజుల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. హార్ట్ ఎటాక్ ఉన్న వారికి ఈ మిషిన్ ద్వారా పరీక్షలు చేస్తారు. వచ్చిన రిపోర్టును ఇక్కడి వైద్యులు ఇంటర్నెట్ ద్వారా హైదరాబాద్లోని పంజాగుట్ట నిమ్స్ దవాఖానలోని కార్డియాలజిస్ట్కు పంపిస్తారు. వారు పరిశీలించి, బాధితులకు ఎలాంటి వైద్యం అందించాలనేది ఇక్కడి వైద్యులకు మెస్సేజ్ రూపంలో పంపిస్తారు. అవసరమైనవారికి గడ్డకట్టిన రక్తం పలుచబడేందుకు రూ.40వేల ఖరీదైన ఇంజక్షన్ను ఉచితంగా ఇస్తారు. అత్యవసరం ఉన్నవారిని వెంటనే హైదరాబాద్లోని నిమ్స్కు పంపించాలని సూచిస్తారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నవారికి ఉచితంగా శస్త్రచికిత్స కూడా చేస్తారు. అక్కడ 24 గంటల పాటు కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉంటున్నారు. బుధవారం రిమ్స్ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ తానాజీ ఈసీజీ పరీక్షలు చేశారు.
మరణాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం..
ప్రతి నెలా హార్ట్ఎటాక్తో ఒక్కరిద్దరు చనిపోతుంటారు. వారికి సరైన సమయంలో సలహాతో కూడిన వైద్యం అందిస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఉద్దేశంతోనే తెలంగాణ సర్కారు ట్రికాగ్ను అన్ని జిల్లాలకు పంపిణీ చేసిం ది. పంజాగుట్ట నిమ్స్లో వైద్యుల సూచనలు, సలహాల మేరకు హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి వైద్యం అందించేందుకు సులువవుతుంది. రిమ్స్లో అడ్మిట్ అయిన వారిపై ప్రతిరోజూ కార్డియాలజిస్ట్ ల పర్యవేక్షణ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వారి వివరాలను తెలుసుకుంటూ ఉంటారు.