వానకాలమైనా, ఎండకాలమైనా వట్టిపోయిన మానేరు వాగును చూసి దిగాలుపడ్డ రైతులకు ప్రస్తుతం పొంగిపొర్లుతున్న చెక్డ్యాంలు కోటి ఆశలు నింపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి-సింగారంలో రూ.7కోట్లతో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు పూర్తి కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు పొంగిపొర్లుతున్నది. నారాయణపూర్- కొండాపూర్ బ్రిడ్జిని ఆనుకుని ఇదివరకే నిర్మించిన చెక్డ్యాంలోకి వరదనీరు చేరడంతో అది కూడా చెరువును తలపిస్తున్నది. ఇక తొలి వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలధార స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. పై నుంచి జాలువారుతున్న నీరు ఆకట్టుకుంటున్నది.
తొలి వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలధార స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. పై నుంచి జాలువారుతున్న నీరు ఆకట్టుకుంటున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి