సంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మడిదల మండలం అన్నారంలో దుండగులు ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అన్నారం ఇటుక బట్టీలలో హిమాన్షు పటేల్ (23) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఆ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి