హైదరాబాద్ : భార్యను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని నార్సింగి పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. భార్యను గొంతుపిసికి చంపి ఆపై భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రమణ, రత్నకుమారి ఇరువురు దంపతులు. పలు అంశాలపై తరచుగా ఘర్షణ పడుతుంటారు. ఇది గత కొన్ని నెలలక్రితం నుంచి ఎక్కువైంది. ఏదో విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తి అది పెరిగడంతో భర్త ఆమెను హత్యచేసి ఉండొచ్చన్నారు. మృతదేహాన్ని మంచం కింద ఉంచి ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.