రంగారెడ్డి : మైలార్దేవ్పల్లిలో ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. అసద్ఖాన్(40) అనే వ్యక్తిని దుండగులు గురువారం మధ్యాహ్నం కత్తులతో పొడిచి చంపారు. శాస్త్రీపురం రోడ్ ఇండియన్ ఫంక్షన్హాల్ సమీపంలో అసద్ బైక్పై వెళ్తుండగా కొందరు అడ్డగించి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఖాన్ను వెంటనే ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అసద్ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.