ఉజ్జయిని, అక్టోబర్ 26: దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయానికి తన భార్య చివరి కోరిక మేరకు ఓ వ్యక్తి రూ.17 లక్షల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. రష్మీప్రభ మహాకాళేశ్వర్ భక్తురాలు. తరచూ ఆలయాన్ని దర్శించుకొనేది. తన బంగారం మొత్తాన్ని సమర్పించుకుంటానని దేవుడికి మొక్కుకున్నది. ఇటీవల ఆమె మరణించింది. జార్ఖండ్లోని బొకారోకు చెందిన ఆమె భర్త సంజీవ్కుమార్.. భార్య చివరి కోరిక మేరకు శనివారం ఆమె నెక్లెస్, గాజులు, చెవిదిద్దులు ఇలా 310 గ్రాముల బంగారు ఆభరణాలు స్వామివారికి సమర్పించినట్టు ఆలయ అధికారి మంగళవారం మీడియాకు వెల్లడించారు.